'పుష్ప-2'లో తృప్టి డివ్రిూతో ఐటమ్‌ సాంగ్‌..!

'పుష్ప-2'లో తృప్టి డివ్రిూతో ఐటమ్‌ సాంగ్‌..!

1 month ago | 34 Views

'పుష్ప-2' చిత్రం విడుదలకు ముందే అనేక సంచలనాలు వస్తున్నాయి. ఈ చిత్రంలో పాటలు శ్రేయాఘోషల్  పాడగా..ఐటమ్‌ సాంగ్‌ కోసం తృప్తి డివ్రిూని తీసుకుని వచ్చే ప్రయటత్నాలు సాగుతున్నాయని సమాచారం. మరో విశేషమేమంటే పార్ట్‌-3 కూడా ప్లాన్‌ చేస్తున్నారని టాక్‌.  ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'పుష్ప 2’.. గతంలో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయిన 'పుష్ప’ సినిమాకు సీక్వెల్‌ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని  మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.


ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్‌ చేసిన పోస్టర్స్‌, టీజర్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా  నుంచి ఫస్ట్‌ సింగల్‌ రిలీజ్‌ చేశారు. 'పుష్ప.. పుష్ప.. ' అంటూ సాగే ఈ పాట ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది.  ఏకంగా 100 మిలియన్‌ వ్యూస్‌ సాధించింది. ఇదిలా  ఉంటే బుధవారం ఈ సినిమా నుంచి సెకండ్‌ సింగల్‌ రిలీజ్‌ అయ్యింది. స్టార్‌ సింగర్‌ శ్రేయ ఘోషల్‌ పాడిన ఈ కపుల్‌ సాంగ్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది అని మేకర్స్‌ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్‌ చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో మేకర్స్‌ ఊహించని ట్విస్ట్‌ ఇవ్వనున్నట్లు సమాచారం. పుష్ప 3 కి సంబంధించి సమాచారం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో అదిరిపోయే ఐటెం సాంగ్‌ కూడా ప్లాన్  చేస్తున్నారని టాక్‌ నడుస్తోంది.

'యానిమల్‌' చిత్రం బ్యూటీ తృప్తి డిమ్రి ఈ సాంగ్‌లో ఆడిపాడనున్నారని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే సుకుమార్‌ ఈ పాటను కూడా షూట్‌ చేసే అవకాశం ఉంది. అయితే 'పుష్ప-3' కూడా ఉంటుందని చాలాకాలంగా టాక్‌ నడుస్తోంది. తాజాగా సోషల్‌ విూడియాలో వస్తున్న వార్తలు దాని గురించే అని టాక్‌. అల్లు అర్జున సరసన రష్మిక మందన్నా నటిస్తోన్న ఈ చిత్రంలో ఫవాద్‌ ఫాజిల్‌, సునీల్‌, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

ఇంకా చదవండి: 'పుష్ప-2' సూసేకి అగ్గిరవ్వ పాట విడుదల!

# Pushpa2     # Rashmikamandanna     # Alluarjun    

trending

View More