రాజకీయాలకు దూరంగా ఉంటున్నా: 'బడ్డీ' ప్రమోషన్‌లో అలీ స్పష్టీకరణ

రాజకీయాలకు దూరంగా ఉంటున్నా: 'బడ్డీ' ప్రమోషన్‌లో అలీ స్పష్టీకరణ

1 month ago | 25 Views

టాలీవుడ్‌లో కమెడియన్‌గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు అలీ ఒకరు.  తన కామెడీ ద్వారా ప్రేక్షకులను నవ్వించి మెప్పించారు. అయితే ఈ నటుడు గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉండి వైసీపీలో చేరి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇక రాజకీయాల్లో ఉన్నప్పుడే తన ప్రాణ స్నేహితుడు ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ విూదా కూడా విమర్శలు గుప్పించాడు. అలీ వైసీపీలో చేరినందుకు ఒకసారి పవన్‌ కళ్యాణ్‌ అలీ గురించి ఘాటుగా విమర్శలు గుప్పించగా.. అలీ అంతకు మించి స్వయంకృషితో నేను పైకొచ్చాను తప్ప నీలా చిరంజీవి వేసిన బాటలో రాలేదంటూ కౌంటరిచ్చారు. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిపోతూ వచ్చింది. అయితే ఏపీ ఎలక్షన్స్‌లో వైసీపీ ఓడిపోయిన అనంతరం అలీ రాజకీయలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. ముఖ్యంగా మళ్లీ తనకు నచ్చిన ఫీల్డ్‌లో సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు.

ఈ క్రమంలోనే ఆయన నటించిన బడ్డీ సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది. అల్లు శీరిష్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం ఆగష్టు 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌ నిర్వహించగా.. ఈ ఈవెంట్‌లో శీరిష్‌తో పాటు అలీ పాల్గోన్నాడు. ప్రస్తుతం పాలిటిక్స్‌లో విూ పోజిషన్‌ ఏంటి అని అడుగగా.. అలీ సమాధానమిస్తూ.. నేను ఇప్పుడు ఏ పోజిషన్‌లో లేను.. ప్రస్తుతం రాజకీయల నుంచి చాలా దూరంగా వచ్చాను. అటువైపు వెళ్లాలి అనుకోట్లేదు. అంటూ అలీ చెప్పుకోచ్చాడు.ఇక మూవీ గురించి మాట్లాడుతూ.. అల్లు శీరిష్‌ ఎప్పుడు తాను ఒక స్టార్‌ హీరో తమ్ముడని బిహేవ్‌ చేయలేదని. నాతో చాలా గౌరవంగా ఉండేవాడు. ఎప్పుడు బడ్డీ సినిమా గురించే మాట్లాడుకునేవాళ్లం. ఇది మా సెకండ్‌ కాంబినేషన్‌. ఈ మూవీ కూడా హిట్‌ అవుతుందని ఆశిస్తున్నాం అంటూ అలీ వెల్లడిరచాడు.

ఇంకా చదవండి: కొత్త - పాత నిర్మాతలకు కొంగు బంగారం జినీవర్స్

# Buddy     # Allusirish     # Ajmal     # Ali    

trending

View More