సైంధవి- జీవీ ప్రకాశ్‌ విడిపోతున్నారు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు!?

సైంధవి- జీవీ ప్రకాశ్‌ విడిపోతున్నారు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు!?

4 months ago | 35 Views

తమిళ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్‌ ఆయన భార్య గాయని సైంధవితో విడిపోతున్నట్లు  ప్రకటించారు. 11 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్లు ఇద్దరూ సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ పోస్టు చేశారు. ఆస్కార్‌ అవార్డ్‌ విన్నర్‌ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్‌ మేనల్లుడు అయిన జీవీ ప్రకాశ్‌.. 2013లో తన బాల్య స్నేహితురాలు సైంధవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2020లో వారికి ఓ కూతురు కూడా పుట్టింది. ప్రస్తుతం పలు కారణాల వల్ల ఇద్దరూ విడిపోతున్నారు. 'చాలా ఆలోచించిన తర్వాత ’సైంధవి.. నేను 11 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాం. మానసిక ప్రశాంతత, ఇద్దరి జీవితాల్లో మెరుగుకోసం ఒకరికొకరం పరస్పర గౌరవంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇలాంటి కీలక తరుణంలో మా ప్రైవసీకి భంగం కలిగించకుండా ఉండేందుకు విూడియా, స్నేహితులు, అభిమానులు మా నిర్ణయాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇక నుంచి మేము వేరవుతున్నట్లు అంగీకరిస్తున్నాం.

ఈ నిర్ణయం ఇద్దరికీ ఉత్తమమని నమ్ముతున్నాం. ఈ క్లిష్ట సమయంలో విూ మద్దతు చాలా అవసరం'' అని జీవీ ప్రకాశ్‌ పేర్కొన్నారు. తమిళంతోపాటు, తెలుగులో కూడా ఎన్నో హిట్‌ చిత్రాలకు జీవీ సంగీతం అందించారు. యుగానికి ఒక్కడు, రాజా రాణి,  అసురన్‌ ,  సురరై పోట్రు  లాంటి సూపర్‌ హిట్‌  చిత్రాలకు పాటలు అందించిన ఆయన తెలుగులో ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్‌, ఎందుకంటే ప్రేమంటా, ఒంగోలు గిత్త, రాజాధి రాజా, జెండాపై కపిరాజు తదితర చిత్రాలకు సంగీతం అందించారు. హీరోగా 15 చిత్రాల్లో నటించారు.

ఇంకా చదవండి: దటీజ్.. 'డబుల్‌ ఇస్మార్ట్‌''!

# Saindhavi     # GV Prakash Kumar     # Tamil    

trending

View More