‘నాన్నా.. నువ్వు చనిపోతావా?’ : దాడి ఘటనను గుర్తుచేసుకున్న సైఫ్ అలీఖాన్
1 month ago | 5 Views
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ ఓ దుండగుడి దాడిలో గాయపడిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ఇంటికి చేరుకున్న ఆయన ప్రస్తుతం ఇంట్లో విశాంత్రి తీసుకుంటున్నారు. దాడి తర్వాత మొదటిసారి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఆ రోజు తన కుమారుడు తైమూర్ మాటలను గుర్తుచేసుకున్నారు. కత్తితో పొడిచి నట్లు మొదట తెలియలేదని, ఏదో చిన్న గాయం అనుకున్నానని చెప్పారు. వీపు భాగంలో నొప్పి రావడంతో కత్తితో దాడి దాడి జరిగిందని గుర్తించినట్లు చెప్పారు.
‘‘దాడి జరిగిన కాసేపటికి నాకు వీపులో విపరీతమైన నొప్పి కలిగింది. అప్పుడు గమనిస్తే కత్తితో దాడి చేసినట్లు తెలిసింది. అది చూసి కరీనా చాలా కంగారు పడింది . అందరికీ ఫోన్లు చేసింది. ఎవరూ ఫోన్ తీయలేదు. ఒకరినొకరం చూసుకున్నాం. నేను బాగానే ఉన్నాను.. నాకేం కాదని ఆమెకు ధైర్యం చెప్పాను. తైమూరు నా దగ్గరకు వచ్చి ‘నాన్నా.. నువ్వు చనిపోతావా?’ అని అడిగాడు. అలా ఏం జరగదన్నాను’’ అని సైఫ్ అన్నారు. సైఫ్ను ఆసుపత్రిలో చేర్చినప్పుడు అతడితో పాటు తైమూర్ కూడా ఆసుపత్రికి వచ్చినట్లు లీలావతి వైద్యులు విడుదల చేసిన నివేదికలో ఉంది.
ఇంకా చదవండి: టైం వస్తేగానీ ఏదీ తెలియదు : కరీనాకపూర్
"Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!"