'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి' రివ్యూలపై మాస్‌ కా దాస్‌ గరంగరం!

'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి' రివ్యూలపై మాస్‌ కా దాస్‌ గరంగరం!

1 month ago | 19 Views

మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి'. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటించారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించారు. భారీ అంచనాలతో మే 31వ తేదీన ’గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి అన్ని వర్గాల నుంచి విశేష స్పందన వస్తోంది. కథా నేపథ్యం కొత్తగా ఉందని, ఎమోషనల్‌ సన్నివేశాలు కట్టిపడేశాయని ప్రేక్షకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రెస్‌ విూట్‌ నిర్వహించిన కథానాయకుడు విశ్వక్‌ సేన్‌, దర్శకుడు కృష్ణ చైతన్య తమ సంతోషాన్ని పంచుకున్నారు. 

ఈ సందర్భంగా హీరో విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలను ఆదరించడంలో ఎప్పుడూ ముందుంటారు. సినిమా చూసి నిజాయితీగా రివ్యూ ఇవ్వడంలో తప్పులేదు. కానీ కొందరు సినిమా చూడకుండానే రివ్యూ రాస్తున్నారు. మరికొందరైతే కావాలని నెగటివ్‌ రివ్యూలు రాస్తున్నారు. అలాంటి రివ్యూలను పట్టించుకోకుండా.. ఎందరో ప్రేక్షకులు సినిమాలు చూడటానికి ముందుకొస్తున్నారని అన్నారు. 'గామి’, 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ ఇలా విశ్వక్‌ సేన్‌ సినిమాల ఎంపిక వైవిధ్యంగా ఉందని ప్రశంసలు రావడం ఆనందంగా ఉందని, ఇక ముందు కూడా ఇలాగే ప్రేక్షకులకు కొత్తదనం ఉన్న సినిమాలను అందిస్తానన్నారు. సినిమాకి వస్తున్న స్పందనతో చాలా హ్యాపీగా ఉన్నామని త్వరలో సక్సెస్‌ విూట్‌ నిర్వహిస్తామన్నారు. దర్శకుడు కృష్ణ చైతన్య  మాట్లాడుతూ.. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన పట్ల చాలా సంతోషంగా ఉన్నామని. యువత యాక్షన్‌ సన్నివేశాలను, డైలాగ్స్‌ ని బాగా ఎంజాయ్‌ చేస్తున్నారన్నారు. ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందని.. సెకండాఫ్‌ లో ఎమోషనల్‌ సన్నివేశాలు బాగా కనెక్ట్‌ అయ్యామని చెబుతుంటే హ్యాపీగా ఉందన్నారు. బాలకృష్ణగారు, వారి కుటుంబం సినిమా చాలా బాగుందని అభినందించడం.. మాటల్లో చెప్పలేని ఆనందాన్ని కలిగించిందని అన్నారు.

ఇంకా చదవండి: ఎమోషనల్‌ ఫ్యామిలీ డ్రామా 'మనమే'.. ప్రతి ఒక్కరికి కనెక్ట్‌ అవుతుందన్న కృతిశెట్టి!

# Gangsofgodavari     # Vishwaksen     # Film