మంచుమనోజ్‌ కుమార్తెకు నామకరణం.. దేవసేన శోభా ఎంఎం అని పేరు!

మంచుమనోజ్‌ కుమార్తెకు నామకరణం.. దేవసేన శోభా ఎంఎం అని పేరు!

2 months ago | 31 Views

 మంచు మనోజ్‌ దంపతులు వారి కుమార్తెకు పేరు పెట్టారు. ఈ విషయాన్ని సోషల్‌ విూడియా వేదికగా తెలియజేశారు. ఏప్రిల్‌లో వీరికి పండంటి ఆడపిల్ల పుట్టిన విషయం తెలిసిందే. ఈ పాపను తామంతా ముద్దుగా 'ఎంఎం పులి’ అని పిలుచుకుంటున్నట్లు గతంలో మంచు లక్ష్మి చెప్పారు. తాజాగా ఆ పాపకు బారసాల చేశారు. ఈ ఫొటోలను మనోజ్‌ తన ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేశారు. కుమార్తెకు 'దేవసేన శోభా ఎంఎం’ అని పేరు పెట్టినట్లు మనోజ్‌ తెలిపారు. 'శివుడి దయతో, విూ అందరి ప్రేమతో మా పాపకు ఈ పేరు పెట్టాం. విూ దీవెనలు కావాలి. శివ భక్తుడిగా.. సుబ్రహ్మణ్యస్వామి భార్య పేరు వచ్చేలా 'దేవసేన’ అని పెట్టాం. మా అత్తగారు శోభా నాగిరెడ్డి పేరు వచ్చేలా 'శోభా’ అని యాడ్‌ చేశాం’ అని పేర్కొన్నారు.

ఈసందర్భంగా మంచు లక్ష్మికి మనోజ్‌ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. మొదటినుంచి ఆమె ఎంతో సపోర్ట్‌గా నిలిచిందన్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఆయన అభిమానులతో పంచుకోగా అవి వైరల్‌ అయ్యాయి. అందులో మోహన్‌బాబు దంపతులతో పాటు మౌనిక రెడ్డి కుటుంబసభ్యులు ఉన్నారు. ఈ పోస్ట్‌కు పలువురు నెటిజన్లు స్పందిస్తూ అభినందనలు చెబుతున్నారు. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో గతేడాది మనోజ్‌ -మౌనికలు వివాహం చేసుకున్నారు. కొన్నాళ్లుగా నటనకు దూరంగా ఉన్న ఈ హీరో ప్రస్తుతం 'వాట్‌ ది ఫిష్‌’తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. వరుణ్‌ కోరుకొండ దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది. నిహారిక కీలకపాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం దీని షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

ఇంకా చదవండి: నన్ను దోషిగా పరిగణించడం తగదు.. 'మా' కు లేఖ రాసిన నటిహేమ!

# Manojkumarmanchu     # Mounikabhumamanchu     # Socialmedia    

trending

View More