ఉత్తరాది నుంచి వచ్చిన మాల్వి..  రాజ్‌తరుణ్‌తో సినిమాలో హీరోయిన్‌

ఉత్తరాది నుంచి వచ్చిన మాల్వి.. రాజ్‌తరుణ్‌తో సినిమాలో హీరోయిన్‌

2 months ago | 22 Views

తెలుగు యువ నటుడు రాజ్‌ తరుణ్‌ ఇప్పుడు వార్తల్లో వున్నాడు. అతని ప్రియురాలు అని చెప్పుకుంటున్న లావణ్య అనే అమ్మాయి నార్సింగి పోలీసు స్టేషన్‌ లో రాజ్‌ తరుణ్‌ పై ఫిర్యాదు చేసింది. తనని ప్రేమించి, పెళ్లి చేసుకుంటాను అని మోసం చేశాడని ఆ ఫిర్యాదులో పేర్కొంది. అలాగే రాజ్‌ తరుణ్‌ ఇప్పుడు చేస్తున్న సినిమా ’తిరగబడరా స్వామి’ లో కథానాయికగా చేస్తున్న మాల్వి మల్హోత్రాతో కలిసి ఉంటున్నాడని కూడా ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా తెలిసింది. అయితే లావణ్య తన ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా రాజ్‌ తరుణ్‌ నిజంగానే మాల్వి తో వుంటున్నాడా? ఇంతకీ ఈ మాల్వి ఎవరు అన్న ఆసక్తి వస్తోంది. మాల్వి మల్హోత్రా హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలో మండి అనే వూర్లో ఒక పంజాబీ కుటుంబంలో పుట్టింది. చదువంతా చండీగఢ్‌ లో సాగింది, తరువాత ఆమె ముంబాయి షిప్ట్‌ అయి, మాస్టర్స్‌ ఇన్‌ కంప్యూటర్స్‌ కోసం యూనివర్సిటీ అఫ్‌ ముంబైలో చదివింది. నటిగా ముందుగా కనిపించింది మాత్రం బుల్లితెరపైనే, 2017లో ’ఉడాన్‌’ అనే సీరియల్‌ లో.. వెండితెరపై ఆమె అరంగేట్రం చేసింది ’హోటల్‌ మిలన్‌’ అనే సినిమాలో.

ఇది 2018లో విడుదలైంది. సుమారు నాలుగేళ్ల తరువాత మాల్వి ’తమస్‌’ అనే ఒక షార్ట్‌ ఫిలింలో నటించింది. ఇది 2022లో వచ్చింది. ఆ తరువాత సంవత్సరం మాల్వి ఒక ఓటిటి సినిమాలో నటించింది, కానీ ఆమెకి తగినంత గుర్తింపు రాలేదనే చెప్పాలి. 2023లో ’అభ్యుహం’ అనే సినిమాతో మలయాళంలో అరంగేట్రం చేసింది. అదే సంవత్సరం రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా నటించిన ’తిరగబడరా స్వామి’ సినిమాతో తెలుగులో కూడా అరంగేట్రం చేస్తోంది. ఈ సినిమా ఇప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, త్వరలోనే విడుదలవుతుంది. ఈ సినిమా చాలా కాలం నుండి చిత్రీకరణ, తరువాత పోస్ట్‌ ప్రొడక్షన్‌ ఇలా చేసుకుంటూ ఈమధ్యనే పూర్తి చేసుకుంది. రాజ్‌ తరుణ్‌ ప్రియురాలు లావణ్య ఆరోపిస్తున్నట్టుగా రాజ్‌ తరుణ్‌ ఈ సినిమాలో చేస్తున్న మాల్వి మల్హోత్రాతో వుంటున్నట్టుగా ఆరోపిస్తుంది. మరి అందులో నిజమెంతవుందో మాత్రం వీళ్ళకే తెలియాలి.

ఇంకా చదవండి: రాజ్‌తరుణ్‌ కేసులో ట్విస్ట్‌.. లావణ్యకు నోటీసులు ఇచ్చిన పోలీసులు

# RajTharun     # MalviMalhotra     # Tollywood     # TeluguCinema    

trending

View More