శ్రీవారి దర్శనం అంటే ఎంతో ఇష్టం.. అందుకే మోకాళ్లతో నడిచి వెళ్లాను:  జాన్వీకపూర్‌ వెల్లడి

శ్రీవారి దర్శనం అంటే ఎంతో ఇష్టం.. అందుకే మోకాళ్లతో నడిచి వెళ్లాను: జాన్వీకపూర్‌ వెల్లడి

3 months ago | 10 Views

శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్‌ యువనటి జాన్వీకపూర్‌ కు దైవభక్తి మెండు. తరచూ ఆమె తిరుమల సందర్శిస్తుంటారు. తన పుట్టినరోజును పురస్కరించుకుని మార్చి 6న స్నేహితులతో కలిసి తిరుమల స్వామి సేవలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఒరీ తాజాగా నెటిజన్లతో పంచుకున్నారు. తిరుమల టూర్‌ ఎలా జరిగిందో అందులో తెలియజేశారు. ఆమెతోపాటు స్నేహితులు శిఖర్‌ పహారియా, ఒరీతో కలిసి అలిపిరి నుంచి కాలి నడకన శ్రీవారి సన్నిధి చేరుకున్నారు. మధ్యలో మోకాళ్ల పర్వతం దగ్గర ఆమె కొంతదూరం మోకాళ్లపై నడిచారు. తదుపరి స్వామిని దర్శించుకున్నారు. ఈ విషయాన్ని జాన్వీ స్నేహితులు శిఖర్‌, ఒరీ ఇన్‌  స్టాగ్రామ్‌ వేదికగా ఓ వీడియో ద్వారా చెప్పారు.

Janhvi Kapoor heads for Tirupati ! her trip to 'Tirumala by walk', watch  photos ! - MixIndia

తిరుమల అడ్వెంచర్‌ టూర్‌ ఎలా జరిగిందో అందులో తెలియజేశారు.చెన్నైలోని జాన్వీ నివాసం నుంచి కారులో మూడు గంటలు ప్రయాణించి తిరుపతి చేసుకున్నామన్నారు. అనంతరం జాన్వీ బంధువులతో కలిసి నడక దారిన తిరుమల చేరుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా జాన్వీ మాట్లాడుతూ  ’ఇప్పటికి 50సార్లు  తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకున్నానని, ఈ దేవాలయం అంటే తనకు  ఎంతో ఇష్టమని జాన్వీ చెప్పారు.

రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా కనిపించనున్న విషయం తెలిసిందే. బుధవారం ఈ సినిమా అట్టహాసంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమం అనంతరం జాన్వీకపూర్‌, ఆమె తండ్రి బోనీ కపూర్‌, ఇతర చిత్రబృందం రామ్‌చరణ్‌ నివాసంలో సందడి చేశారు. చరణ్‌తో సరదాగా మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫొటోలను జాన్వీ ఇన్‌స్టాలో షేర్‌ చేశారు.

ఇంకా చదవండి: 'గుంటూరు కారం'తో క్రికెటర్‌ అశ్విన్‌ ఫిదా!

# RC16     # Ram Charan     # Janhvi Kapoor     # Vijay Sethupathi     # Buchi Babu    

trending

View More