నన్ను దోషిగా పరిగణించడం తగదు.. 'మా' కు లేఖ రాసిన నటిహేమ!

నన్ను దోషిగా పరిగణించడం తగదు.. 'మా' కు లేఖ రాసిన నటిహేమ!

2 months ago | 28 Views

 తనను మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) నుంచి తొలగించడం అన్యాయమని నటి హేమ అన్నారు. తిరిగి సభ్యత్వం కల్పించాలని కోరారు. ఇటీవల బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో పోలీసులు ఆమెను  అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అసోసియేషన్‌ నుంచి హేమను సస్పెండ్‌ చేసినట్లు 'మా’ ప్రకటించింది. ఈ  అంశంపై తాజాగా ఆమె బహిరంగ లేఖ రాశారు. దాన్ని మా అధ్యక్షుడు మంచు విష్ణుకు అందజేశారు. తాను నిర్దోషినని పేర్కొన్నారు. 'విూడియా నాపై అనేక నిరాధారమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో దేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన ల్యాబ్‌లో నేను పరీక్షలు చేయించుకున్నా.

వాటిలో నేను డ్రగ్స్‌ తీసుకోలేదని స్పష్టమైంది. త్వరలోనే పోలీసులు చేసిన పరీక్షల్లోనూ ఇవే రిజల్ట్స్‌ వస్తాయని నాకు నమ్మకం ఉంది. ఈలోపే నన్ను దోషిగా భావించి 'మా’ సభ్యత్వం రద్దు చేయడం సరైంది కాదని భావిస్తున్నా. గత కొన్ని రోజులుగా నాపై జరుగుతోన్న ప్రచారం వల్ల నేను తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నా. ఈ పరిస్థితుల్లో నాకు 'మా’ అండగా ఉండాలని కోరుకుంటున్నా. ఎన్నో ఏళ్లుగా ఇండస్త్రీలో  కొనసాగుతున్నా. ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నా. ఇలాంటి ప్రచారం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటి నుంచి నన్ను రక్షించాల్సిన బాధ్యత 'మా’పై ఉంది. ఈ విషయాన్ని గమనించి నాపై సస్పెన్షన్‌ ఎత్తివేస్తారని ఆశిస్తున్నా' అని ఆ లేఖలో పేర్కొన్నారు.

ఇంకా చదవండి: కమల్‌ అంతటి నటుడిని చూడలేదు: 'భారతీయుడు' ప్రీ ఈవెంట్‌లో బ్రహ్మానందం

# Hema     # Tollywood     # Socialmedia    

trending

View More