
శ్రీ వేధాక్షర మూవీస్ నిర్మాత చింతపల్లి రామారావు చేతికి ధనుష్ ఇడ్లీ కడై తెలుగు హక్కులు !!!
1 month ago | 5 Views
హీరో ధనుష్ నటిస్తూ దర్శకత్వం వహిస్తోన్న చిత్రం 'ఇడ్లీ కడై' ఈ చిత్రంలో నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ధనుష్ కు ఇది నటుడిగా యాభై రెండో ఫిలిమ్ అలాగే తను డైరెక్ట్ చేస్తోన్న నాలుగో సినిమా ఇదే అవ్వడం విశేషం.
శ్రీ వేధాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు ఈ చిత్ర తెలుగు హక్కులను దక్కించుకున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో ఈ ఏడాది వేసవిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తున్నారు. ఇటీవల నిర్మాత చింతపల్లి రామారావు విజయ్ సేతుపతి నటించిన విడుదల 2 చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు.
రాయన్ సినిమా తరువాత ధనుష్ నటిస్తూ డైరెక్ట్ చేస్తోన్న సినిమా 'ఇడ్లీ కడై' అందుచేత ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది. ఈ సినిమాలో అరుణ్ విజయ్, సత్యరాజ్, అశోక్ సెల్వన్ మరియు రాజ్కిరణ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రసన్న జీకె ఎడిటర్ గా వర్క్ చేస్తున్న ఈ సినిమాకు కిరణ్ కౌశిక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వండర్ బార్ ఫిలిమ్స్, డాన్ పిక్చర్స్ బ్యానర్స్ పై ధనుష్, ఆకాష్ భాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
శ్రీ వేధాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు మరిన్ని మంచి చిత్రాలు ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. వాటి వివరాలు త్వరలో మీడియాకు తెలియజేయనున్నారు.
ఇంకా చదవండి: ప్రభాస్తో కలిసి నా 544వ ప్రాజెక్ట్ చేయడం ఆనందంగా ఉంది : అనుపమ్ ఖేర్
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# ఇడ్లీ కడై # ధనుష్