మెల్‌బోర్న్‌ ఫిలిం ఫెస్టివల్‌కు రామ్‌చరణ్‌..  14 ఏళ్ల తరవాత రావడం ఆనందంగా ఉందని వ్యాఖ్య

మెల్‌బోర్న్‌ ఫిలిం ఫెస్టివల్‌కు రామ్‌చరణ్‌.. 14 ఏళ్ల తరవాత రావడం ఆనందంగా ఉందని వ్యాఖ్య

1 month ago | 16 Views

ఆస్ట్రేలియాలోని  మెల్‌బోర్న్‌ వేదికగా జరుగుతోన్న 'ది ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌’కు గౌరవ అతిథిగా రామ్‌చరణ్‌  హాజరయ్యారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చేసిన సేవలకుగాను 'ఆర్ట్‌ అండ్‌ కల్చర్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌’గా అంతర్జాతీయ వేదికపై అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 'ఆరెంజ్‌’ రోజులను గుర్తుచేసుకున్నారు. 14 ఏళ్ల క్రితం 'ఆరెంజ్‌’ సినిమా కోసం ఆస్ట్రేలియాలోని ఈ ప్రదేశానికి వచ్చాను. అది నా మూడో చిత్రం. 30 రోజులు చిత్రీకరణ ఇక్కడే జరిగింది. షూటింగ్‌ పూర్తయి భారత్‌కు వెళ్లే సమయంలో భావోద్వేగానికి గురయ్యాను. ఇక్కడి ప్రజల ప్రేమను, ఆ రోజులను ఎప్పటికీ మర్చిపోలేను.

అప్పటి కంటే ఇప్పుడు ఎక్కువ మంది ఇండియన్స్‌ ఇక్కడ కనిపిస్తున్నారు. నా హోం టౌన్‌కు వచ్చినట్లు అనిపిస్తోంది. విూ అందరినీ చూస్తుంటే ఆనందంగా ఉంది. భారతీయ చిత్రపరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం సంతోషంగా ఉంది. విూ అందరి వల్లే ఇది సాధ్యమైంది. ఈ ఈవెంట్‌ ఎప్పటికీ ప్రత్యేకమే’ అని చెప్పారు. ఆస్ట్రేలియాలో మన జాతీయ జెండాను ఎగురవేసిన రామ్‌ చరణ్‌.. అక్కడ అభిమానులతో కలిసి ఫొటోలు దిగారు. వాళ్లతో కలిసి సరదాగా సమయాన్ని గడిపారు. ప్రస్తుతం ఈ హీరో 'గేమ్‌ ఛేంజర్‌’ తో బిజీగా ఉన్నారు. శంకర్‌ దర్శకత్వంలో ఇది రానుంది. పొలిటికల్‌, యాక్షన్‌ నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్‌ కథాంశంతో సిద్ధమవుతోంది. ఇందులో రామ్‌ చరణ్‌ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నట్లు సమాచారం. డిసెంబర్‌లో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇంకా చదవండి: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ముఖ్య అతిథులుగా 'మారుతి నగర్ సుబ్రమణ్యం' ప్రీ రిలీజ్ ఈవెంట్

# Ram Charan     # Upasana     # Chiranjeevi    

trending

View More