యాక్సిడెంట్‌ అయ్యింది....కోలుకుంటున్నా.. ఇన్స్‌టాలో పోస్ట్‌ పెట్టిన నటి రష్మిక మందన్నా

యాక్సిడెంట్‌ అయ్యింది....కోలుకుంటున్నా.. ఇన్స్‌టాలో పోస్ట్‌ పెట్టిన నటి రష్మిక మందన్నా

8 days ago | 12 Views

సోషల్‌ విూడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే...నటి రష్మిక మందన్నా ఈ మధ్య ఎక్కువగా కనిపించడం లేదు. ఆమెపై ఎలాంటి వార్తలు వినిపించలేదు. ఈక్రమంలో తాజాగా రష్మిక మంధన్నానే ముందుకు వచ్చి అసలు విషయాన్ని వెళ్లడిరచింది. గత నెల రోజులుగా నేను యాక్టివ్‌గా లేను. గత నెలలో నాకు యాక్సిడెంట్‌ అయ్యింది ఇప్పుడు కోలుకున్నాను అంటూ తన ఇన్ట్సాలో పోస్ట్‌ పెట్టింది. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు ఇంట్లోనే ఉంటున్నానని, త్వరలోనే మళ్లీ షూటింగ్స్‌ కు హాజరవుతానని రష్మిక తెలిపింది. అంతేకగాక జీవితం చాలా విలువైనది. జాగ్రత్తగా ఉండండి. రేపనేది ఉంటుందో లేదో తెలీదు. హ్యాపీగా జీవించండి అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఇప్పుడీ పోస్టు సామాజిక మాద్యమాల్లో బాగా వైరల్‌ అవుతుంది.

ఇదిలాఉండగా అసలు ప్రమాదం ఎలా జరగింది, షూటింగ్‌లో అయిందా లేక ట్రావెలింగ్‌లో ఏమైనా అయిందా అనే విషయాన్ని చెప్పలేదు. రష్మిక  స్పీడుగా కోలుకోవాలని ఆమె అభిమానులు  ప్రార్దిస్తున్నారు. ఇక రష్మిక నటించిన పుష్ప2, కుబేర సినిమాలు ఈ డిసెంబర్‌లో విడుదలవనుండగా సల్మాన్‌ఖాన్‌తో చేస్తున్న బాలీవుడ్‌ చిత్రం సికిందర్‌ వచ్చే సంవత్సరం రంజాన్‌కు రిలీజ్‌ కానుంది. ఇవిగాక రెయిన్‌ బో, ది గర్ల్‌ఫ్రెండ్‌ అనే రెండు తెలుగులో చిత్రాల్లో ప్రస్తుతం రష్మిక నటిస్తోంది.

ఇంకా చదవండి: అక్షరహాసన్‌తో తనూజ్‌ వీర్వాణి బ్రేకప్‌.. ప్రైవేట్‌ ఫోటోలు లీకే కారణమని పుకార్లు

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# Pushpa2     # Rashmikamandanna     # Salmankhan    

trending

View More