రెండు సినిమాలతో రాబోతున్న యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ కృష్ణ మళ్ళ

రెండు సినిమాలతో రాబోతున్న యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ కృష్ణ మళ్ళ

4 days ago | 5 Views

ఇప్పుడున్న పరిస్థితుల్లో  దర్శకుడనేవాడు ఐదారు సంవత్సరాలకు ఓ సినిమా డైరెక్ట్ చేస్తున్న ప్రస్తుత తరుణం లో ఓ యంగ్ డైరెక్టర్ ఏకంగా రెండు సినిమాలతో ఈ  వేసవి లో టాలీవుడ్ ను టచ్ చేయబోతున్నాడు. అతను మరెవరో కాదు  వంశీ కృష్ణ మళ్ళ. లెజెండరీ స్టార్  యాక్టర్ మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి ప్రధాన పాత్రల్లో త్వరలో రాబోతున్న "దక్ష" ఓ వైపు...హర్ష, ఇనయ సుల్తానా కాంబినేషన్లో తెరకెక్కిన "మదం" సినిమా మరోవైపు... ఇలా రెండు సినిమాల డైరెక్షన్ బాధ్యతలు దిగ్విజయం గా పూర్తి చేసుకుని , రెండు సినిమాలను  ఈ  వేసవిలో రిలీజ్ చేయడానికి సన్నద్ధమయ్యారు.

 ఈ  సందర్భంగా వంశీకృష్ణ మళ్ళ మాట్లాడుతూ "నాకు దక్ష వంటి మంచి చిత్రాన్ని దర్శకత్వం వహించే బాధ్యతను అప్పగించిన మోహన్ బాబు గారికి, మంచు లక్ష్మి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే సెన్సార్ బోర్డు మదం సినిమా చాలా హార్డ్ హిట్టింగ్ గా ఉందనిపించి రివిజన్ కమిటీ కి సిఫార్సు చేసారు.రివిజన్ కమిటీ క్లియరెన్స్ ఇవ్వగానే ఈ వేసవి కి థియేటర్స్ లో రిలీజ్ చేస్తాం.ఆ రెండు సినిమాలు సక్సెస్ బాటలో పయనించి తనకు డైరెక్టర్ గా మంచి నేమ్ తెస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు వంశీ కృష్ణ మళ్ళ.

ఇంకా చదవండి: ఏప్రిల్ 18న విడుదల కానున్న సుమయ రెడ్డి ‘డియర్ ఉమ’ చిత్రం

Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# వంశీ కృష్ణ మళ్ళ     # దక్ష     # మదం