'ది దిల్లీ ఫైల్స్‌' ప్రకటన చేసిన వివేక్‌ అగ్నిహోత్రి!

'ది దిల్లీ ఫైల్స్‌' ప్రకటన చేసిన వివేక్‌ అగ్నిహోత్రి!

4 months ago | 34 Views

వివేక్‌ అగ్నిహోత్రి దర్శకత్వంలో వచ్చిన 'ది కశ్మీర్‌ ఫైల్స్‌’ ఎంతగా సంచలనం సృష్టించింతో తెలిసిందే! ప్రస్తుతం ఆయన మరో సంచలనానికి తెరదీస్తూ 'ది దిల్లీ ఫైల్స్‌' ను ప్రకటించారు. దీనిపై ఆయన తాజా అప్‌డేట్‌ ఇచ్చారు. 'ది దిల్లీ ఫైల్స్‌’  ఈ ఏడాదిలో సెట్స్‌ విూదకెళ్లనుందని చెప్పారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుందని వెల్లడించారు.  అయితే ఈ చిత్రంలో పెద్దస్టార్స్‌ ఎవరూ ఉండరని, కంటెంట్‌ మాత్రం ఈ చిత్రానికి పెద్ద అని ఆయన వ్యాఖ్యానించారు. ఇంకా వివేక్‌ మాట్లాడుతూ  ‘కొన్ని సంవత్సరాల నుంచి నేను ఎవరూ చెప్పలేని కథలను ప్రపంచం కళ్లకు కట్టినట్లు చూపించడం మొదలుపెట్టాను.

వాటిలో మొదటిది 'ది తాష్కంట్‌ ఫైల్స్‌’.. ఇది విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రెండోది 'ది కశ్మీర్‌ఫైల్స్‌’ ఈ సినిమా. అది ఎంతగా సంచలనం సృష్టించిందో తెలిసిందే! అదే రూట్‌లో నా నుంచి వస్తున్న మూడో చిత్రం 'ది దిల్లీ ఫైల్స్‌. భావోద్వేగం ఉన్న ప్రతి ఒక్కరికీ ఈచిత్రం కనెక్ట్‌ అవుతుంది. అభిషేక్‌ అగర్వాల్‌ ఈ చిత్రానికి కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు' అని అన్నారు. ప్రస్తుతం వివేక్‌ నవల ఆధారంగా తెరకెక్కుతున్న 'పర్వ’తో బిజీగా ఉన్నారు. ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మహాభారతం ఆధారంగా మూడు భాగాలుగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇంకా చదవండి: 'డబుల్‌ ఇస్మార్ట్‌’ ఆలస్యానికి ఎవరు కారణం?

# TheDelhiFiles     # VivekRanjanAgnihotri    

trending

View More