'నింద'తో వస్తున్న వరుణ్‌ సందేశ్‌!

'నింద'తో వస్తున్న వరుణ్‌ సందేశ్‌!

1 month ago | 12 Views

కాండ్రకోట మిస్టరీ అంటూ యథార్థ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం 'నింద’లో వరుణ్‌ సందేశ్‌ హీరోగా నటించారు. ఈ మూవీని రాజేష్‌ జగన్నాథం నిర్మించడమే కాకుండా కథ, కథనాన్ని రాసి దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన టైటిల్‌ పోస్టర్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా ఈ మూవీ టీజర్‌ను విలక్షణ నటుడు నవీన్‌ చంద్ర చేతుల విూదుగా మేకర్స్‌ విడుదల చేశారు. ఇటీవల జరిగిన దాదా సాహెబ్‌ ఫాల్కే ఫెస్టివల్‌ అవార్డ్స్‌లో అవార్డును అందుకున్న నవీన్‌ చంద్ర టీజర్‌ విడుదల చేసిన అనంతరం చిత్రయూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌ తెలిపారు. టీజర్‌ బాగుందని టీంను మెచ్చుకున్నారు.


సినిమా మంచి విజయం సాధించి టీమ్‌ అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరారు.టీజర్‌ విషయానికి వస్తే.. 'జీవితంలో కొన్ని సార్లు తప్పని తెలిసినా చేయక తప్పదు’.. అనే డైలాగ్‌తో మొదలైన ఈ టీజర్‌లో ఎన్నో కోణాలున్నాయి. అందమైన ప్రేమ కథ కనిపిస్తోంది. దాంతో పాటుగా మర్డర్‌, కైమ్ర్‌ మిస్టరీ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే టీజర్‌లోని విజువల్స్‌ కూడా ఎంతో న్యాచురల్‌గా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆర్‌ఆర్‌ అయితే మూడ్‌కు తగ్గట్టుగా సాగింది. థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ను ఫీల్‌ అయ్యేలా నేపథ్య సంగీతం సాగింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయని.. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని దర్శకనిర్మాత తెలిపారు.

ఇంకా చదవండి: 'గేమ్‌ ఛేంజర్‌' తరవాతే బుచ్చిబాబుతో సినిమా!

# Nindha     # ChitramChoodara     # VarunSandesh     # TeluguCinema