.webp)
మార్చి 21న వస్తున్న "రాజుగారి దొంగలు"
1 month ago | 5 Views
లోహిత్ కల్యాణ్, రాజేష్ కుంచాడా, జోషిత్ రాజ్ కుమార్, కైలాష్ వేలాయుధన్, పూజా విశ్వేశ్వర్, టీవీ రామన్, ఆర్కే నాయుడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా రాజు గారి దొంగలు. ఈ చిత్రాన్ని నడిమింటి లిఖిత సమర్పణలో హిటాసో ఫిలిం కంపెనీ బ్యానర్ పై నడిమింటి బంగారునాయుడు నిర్మిస్తున్నారు. దర్శకుడు లోకేష్ రనాల్ హిటాసో రూపొందిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 21న ప్రపంచం వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు లోకేష్ రనాల్ హిటాసో మాట్లాడుతూ మంచి వైవిధ్యమైన కథతో సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుందని, ఈ నెల 21న మీ ముందుకు తీసుకొస్తున్నామని తెలుగు ప్రేక్షకులందరు ఆదరించాలని అన్నారు.
ఈ చిత్రానికి డీవోపీ – సందీప్ బదుల, ప్రకాష్ రెడ్డి,
స్టోరీ రైటర్స్ – సుమంత్ పల్లాటి, సూరాడ బ్రహ్మ విజయ్,
మ్యూజిక్ – నాఫల్ రాజా ఏఐఎస్,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – రాజవంశీ,
పీఆర్ఓ – చందు రమేష్,
బ్యానర్ – హిటాసో ఫిలిం కంపెనీ,
సమర్పణ – నడిమింటి లిఖిత,
నిర్మాత – నడిమింటి బంగారునాయుడు,
దర్శకత్వం – లోకేష్ రనాల్ హిటాసో.
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!