'బార్డర్‌' మూవీ సీక్వెల్‌పై సన్నీ డియోల్‌ దృష్టి!

'బార్డర్‌' మూవీ సీక్వెల్‌పై సన్నీ డియోల్‌ దృష్టి!

3 months ago | 24 Views

బాలీవుడ్‌ నటుడు సన్నీ డియోల్‌ ప్రస్తుతం సీక్వెల్‌లపై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. గతేడాది 'గదర్‌ 2'తో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న ఈ నటుడు ఇప్పుడు మరో బ్లాక్‌ బస్టర్‌ సినిమాకు సీక్వెల్‌ ప్రకటించాడు. అగ్రనటులు  సన్నీ డియోల్‌, జాకీష్రాఫ్‌, సునీల్‌శెట్టి, అక్షయ్‌ఖన్నా ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా 'బార్డర్‌'.  భారత్‌ పాకిస్థాన్‌ 1971 యుద్ధ నేపథ్యంలో 1997లో విడుదలైన ఈ చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించింది. జేపీ దత్తా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అను మాలిక్‌, ఆదేశ్‌ శ్రీవాస్తవ సంగీతం అందించగా.. కేవలం రూ.10 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 65 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

అయితే ఈ సినిమా విడుదలై నేటికి 27 ఏండ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మూవీ సీక్వెల్‌ను అనౌన్స్‌ చేశారు మేకర్స్‌. దీనితో పాటు స్పెషల్‌ గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు. 27 ఏళ్ల క్రితం ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు మళ్లీ తిరిగి వస్తోంది. ' బోర్డర్‌ 2' సినిమాకు అనురాగ్‌సింగ్‌  దర్శకత్వం వహించ నుండగా.. భూషణ్‌కుమార్‌, కృష్ణన్‌కుమార్‌, జేపీదత్తా, నిధిదత్తా కలిసి నిర్మిస్తున్నారు. ఆయుష్మాన్‌ ఖురానా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం.

ఇంకా చదవండి: ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ కాబినేషన్‌ .. డ్రాగన్‌ గా పేరును పరిశీలిస్తున్న టీమ్‌!

# Border     # SunnyDeol     # PoojaBhatt     # TeluguCinema    

trending

View More