కృతిశెట్టితో కలసి 'మనమే' అంటున్న శర్వానంద్‌!

కృతిశెట్టితో కలసి 'మనమే' అంటున్న శర్వానంద్‌!

1 month ago | 20 Views

టాలీవుడ్‌ హీరో శర్వానంద్‌ నటిస్తోన్న తాజా చిత్రం 'మనమే'. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కృతిశెట్టి ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. ఈ మూవీ నుంచి వెడ్డింగ్‌ సాంగ్‌ తప్పా తప్పా అప్‌డేట్‌ అందించారు మేకర్స్‌. హీరోహీరోయిన్లపై వచ్చే ఈ సాంగ్‌ను మే 30న లాంఛ్‌ చేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ గ్లింప్స్‌ సినిమాపై అంచనాలు పెంచు తోంది. నిరీక్షణ దాదాపు ముగిసింది.


ఈ సీజన్‌ బిగ్గెస్ట్  ఎంటర్‌టైనర్‌ 'మనమే' జూన్‌ 7న విడుదల కానుందని ఇప్పటికే తెలియజేశారు మేకర్స్‌.  మేకర్స్‌ లాంఛ్‌ చేసిన  వీడియో సినిమా ఎలా ఉండబోతుందో హింట్‌ ఇచ్చేసింది. ఈ మూవీని పీపుల్‌ విూడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ తెరకెక్కిస్తున్నారు.  ఈ చిత్రానికి ఏడిద రాజా అసోసియేట్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. మలయాళ కంపోజర్‌ హేశమ్‌ అబ్దుల్‌ వహబ్‌ మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నారు.

ఇంకా చదవండి: అరుదైన వ్యాధితో బాధపడుతున్న నటుడు ఫహద్‌ ఫాసిల్‌

# Manamey     # Sharwanand     # Krithishetty