'దక్షిణ' మూవీ ట్రైలర్‌ చూసి భయపడ్డా: సానా

'దక్షిణ' మూవీ ట్రైలర్‌ చూసి భయపడ్డా: సానా

4 months ago | 31 Views

ఓషో తులసిరామ్‌ తెరకెక్కించిన 'దక్షిణ’ మూవీ ట్రైలర్‌ చూసి భయపడ్డానని అన్నారు యంగ్‌ డైరెక్టర్‌ బుచ్చిబాబు సానా. 'మంత్ర, 'మంగళ’ సినిమాలతో తెలుగు చలన చిత్ర రంగంలో లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌కి ఒక ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన డైరెక్టర్‌ ఓషో తులసిరామ్‌. ఈ మధ్య కాస్త గ్యాప్‌ తీసుకున్న ఆయన మళ్లీ 'దక్షిణ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కల్ట్‌ కాన్సెప్ట్స్‌ మూవీ బ్యానర్‌ నిర్మాణంలో అశోక్‌ షిండే నిర్మించిన ఈ సినిమాలో 'కబాలి’ ఫేమ్‌ సాయి ధన్షిక  హీరోయిన్‌ కాగా.. 'మహాభారత్‌ మర్డర్స్‌’ ఫేమ్‌ రిషవ్‌ బసు మరొక ముఖ్య పాత్రలో నటించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని దర్శకుడు బుచ్చిబాబు సానా చేతుల విూదుగా మేకర్స్‌ విడుదల చేశారు.


టీజర్‌ విడుదల అనంతరం బుచ్చిబాబు మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో నన్ను బయపెట్టిన ట్రైలర్‌ ఇదే. మళ్లీ తులసి రామ్‌గారు టాలీవుడ్‌కి మరో ట్రెండ్‌ సెట్టర్‌ సైకో థ్రిల్లర్‌ని 'దక్షిణ’ సినిమాతో ఇవ్వబోతున్నారు. ట్రైలర్‌ చాలా బాగుంది. ఈ సినిమా పెద్ద హిట్టవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. అనంతరం నిర్మాత అశోక్‌ షిండే మాట్లాడుతూ.. బుచ్చిబాబుకు ధన్యవాదాలు తెలిపారు. 'దక్షిణ’ సినిమా సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది, నెక్ట్స్‌ ఏం జరుగుతుంది? అనే సస్పెన్స్‌ ప్రేక్షకుల్లో కలిగించేలా ఉండే ఈ సినిమాను త్వరలోనే థియేటర్లలోకి తీసుకువస్తాం. ఈ సినిమా విడుదల ఎప్పుడనేది అతి త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత అశోక్‌ షిండే  చెప్పుకొచ్చారు. చిత్ర గ్లింప్స్‌కు, అలాగే ఇప్పుడు విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తున్నందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాతలతో పాటు చిత్ర బృందం పాల్గొన్నది.

ఇంకా చదవండి: మమ్ముట్టి సినిమాలో నయనతార!

# Dakshina     # BuchiBabuSana     # SaiDhanshika     # TeluguCinema    

trending

View More