
రామ్ పోతినేని - మహేష్ బాబు పి కలయికలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న #RAPO22 రాజమండ్రి షెడ్యూల్ పూర్తి
2 days ago | 5 Views
ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమాను నిర్మిస్తోంది. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' విజయం తర్వాత యంగ్ అండ్ టాలెంటెడ్ మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలు. హీరోగా రామ్ 22వ చిత్రమిది. అందుకని #RAPO22ను వర్కింగ్ టైటిల్గా వ్యవహరిస్తున్నారు. రాజమండ్రిలో సెకండ్ షెడ్యూల్ ముగించుకుని చిత్ర బృందం హైదరాబాద్ వచ్చింది.
రాజమండ్రిలో 34 రోజుల పాటు నాన్ స్టాప్గా డే అండ్ నైట్ షూటింగ్ చేసింది RAPO22 యూనిట్. ఈ షెడ్యూల్లో రెండు పాటలతో పాటు ఒక యాక్షన్ సీక్వెన్స్, ఇంకా ఇంపార్టెంట్ టాకీ సీన్స్ షూటింగ్ చేశారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో అందమైన లొకేషన్లను అంతే అందంగా క్యాప్చర్ చేశామని చిత్ర బృందం చెబుతోంది.
రాజమండ్రిలో జరిగిన చిత్రీకరణలో హీరో రామ్ పోతినేని, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే సహా రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ తదితర తారాగణం మీద సినిమా చిత్రీకరించారు. మార్చి 28వ తేదీ నుంచి హైదరాబాద్ షెడ్యూల్ మొదలవుతుందని నిర్మాతలు తెలిపారు.
రామ్ జంటగా భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ ఇతర తారాగణం.
ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ : అవినాష్ కొల్లా,
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్,
సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ నూని,
మ్యూజిక్: వివేక్ - మెర్విన్,
సీఈవో: చెర్రీ,
ప్రొడక్షన్ హౌస్: మైత్రి మూవీ మేకర్స్,
ప్రొడ్యూసర్స్: నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్,
కథ - కథనం - దర్శకత్వం: మహేష్ బాబు పి.
ఇంకా చదవండి: మలయాళ సినీ హిస్టరీలోనే తొలిసారిగా ఐమ్యాక్స్ ఫార్మేట్లో ట్రైలర్ రిలీజ్..
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!