త్వరలోనే పట్టాలెక్కనున్న పవన్‌కల్యాణ్‌ 'ఓజి'

త్వరలోనే పట్టాలెక్కనున్న పవన్‌కల్యాణ్‌ 'ఓజి'

15 hours ago | 5 Views

అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్‌ సినిమాలు ఒకదానివెంట మరొకటి వరుసగా పునమ్  ప్రారంభం అవుతున్నాయి. 'హరి హర వీరమల్లు’ చిత్రీకరణ ఇప్పటికే ఊపందుకుంది. విజయవాడలో కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే 'ఓజీ’ సెట్‌లోకీ అడుగు పెట్టనున్నారు పవన్‌కల్యాణ్‌. సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్న'ఓజీ’ చిత్రీకరణని పునమ్ ప్రారంభించినట్టు నిర్మాణ సంస్థ ప్రకటించింది. రామోజీ ఫిల్మ్‌సిటీలో కథానాయకుడు లేని కొన్ని కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు.

Pawan Kalyan.. సినిమా ఇష్టమే.! కానీ, సమాజమంటే బాధ్యత.! - Mudra369

'హరిహర వీర మల్లు’ పూర్తయిన తర్వాత, పవన్‌కల్యాణ్‌ 'ఓజీ’ సెట్లోకి అడుగు పెట్టనున్నారు. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఎన్నికల కారణంగా గతేడాది వీటి చిత్రీకరణ నిలిచిపోయిన విషయం తెలిసిందే. వీటితోపాటు 'ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ కూడా పూర్తి చేయాల్సి ఉంది పవన్‌. ఆయన ఆంధప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, మధ్యలో సినిమాలకి సమయం కేటాయిస్తున్నారు.

ఇంకా చదవండి: కొత్త సినిమాను ప్రారంభించిన సాయిదుర్గా తేజ్‌!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# OG     # PawanKalyan     # ShreyaReddy    

trending

View More