'ప్రతినిధి-2' గా వస్తోన్న నారా రోహిత్!
6 months ago | 29 Views
దాదాపు ఆర పుష్కరం తర్వాత నారా రోహిత్ నటిస్తున్న చిత్రం 'ప్రతినిధి-2'. 2014లో విడుదలై ఓ కల్ట్ చిత్రంగా పేరు దక్కించుకున్న 'ప్రతినిధి' సినిమాకు సీక్వెల్గా ఈ సినిమా తెరకెకక్కుతోండగా ప్రముఖ జర్నలిస్టు మూర్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. తాజాగా ఈ చిత్రం టీజర్ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. అప్పటి 'ప్రతినిధి' సినిమా స్టయిల్ లోనే ఈ సినిమా కూడా ఆద్యంతం ఔట్ అండ్ ఔట్ పొలిటికల్ థ్రిల్లర్ కథాంశంతోనే సమకాలీన రాజకీయాలపై సైటైర్లు వేస్తూ సాగనుంది. సినిమాలో దాదాపు అంతా సచిన్ ఖేడేకర్, జిష్ణు సేన్గుప్తా, రఘుబాబు, ఫృథ్వీ, అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి పేరున్న నటులు నటిస్తుండడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెంచేస్తున్నాయి.
మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ముఖ్యంగా.. సినిమాలోని జనం కోసం బతికితే చచ్చాక కూడా బతికే ఉంటాం, ఓటు వేయండి.. లేదంటే ఈ దేశం వదిలి వెళ్ళిపోండి.. అది.. కుదరకపోతే చచ్చిపోండి.! వంటి డైలాగ్స్ అలోచింపజేసే విధంగా ఉండగా సోషల్ విూడియాలో పెద్ద రచ్చే చేస్తున్నాయి. ఈ చిత్రం కూడా అప్పటి ప్రతినిధి సినిమాకు ఏ మాత్రం తగ్గకుండా ' ప్రతినిధి -2' ఉంటుందని ఈ టీజర్ చూస్తేనే తెలిసిపోతుంది. టీజర్ విడుదల చేసిన కాసేపట్లోనే యూట్యూబ్లో, సోషల్ విూడియాలో బాగా వైరల్ అవుతోంది. సరిగ్గా ఏపీ ఎన్నికల సమయానికి దింపారని ఈ సమయంలో ఇలాంటి చిత్రం చాలా అవసరమంటూ చాలా మంది కితాబులిస్తున్నారు. సినిమా ఏప్రిల్లో విడుదల కానుంది. విూరు ఇంతవరకు టీజర్ చూడలేదా ఇప్పుడే చూసేయండి మరి.. ఇంకా ఆలస్యమెందుకు....!
ఇంకా చదవండి: వరుస సినిమాలతో బిజీగా సూర్య!
# Pratinidhi2 # Nararohit # Chiranjeevi