రాజమౌళి-మహేశ్‌ బాబు కాంబో.. త్వరలోనే పట్టాలెక్కనున్నట్లు కీరవాణి వెల్లడి

రాజమౌళి-మహేశ్‌ బాబు కాంబో.. త్వరలోనే పట్టాలెక్కనున్నట్లు కీరవాణి వెల్లడి

9 days ago | 16 Views

మహేశ్‌ బాబు-రాజమౌళి కాంబోలో తెరకెక్కనున్న ’ఎస్‌ఎస్‌ఎంబీ 29’ చిత్రానికి సంబంధించిన ఏ వార్త బయటకు వచ్చినా విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతోందా? అని అటు మహేష్‌, ఇటు, రాజమౌళి ఫ్యాన్‌ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సంగీత దర్శకుడు కీరవాణి ఓ అప్‌డేట్‌ ఇచ్చారు. ‘నేను ఇప్పటి వరకూ ఈ సినిమా సంగీత పనులు మొదలుపెట్టలేదు. ఈ వారమే స్టోరీ లాక్‌ అయింది. టెస్ట్‌ షూట్స్‌ జరుగుతున్నాయి. జులై లేదా ఆగస్టులో మ్యూజిక్‌ వర్క్‌ మొదలుపెడతా’ అని అన్నారు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న ’విశ్వంభర’ చిత్రానికి సంగీతం అందిస్తున్న కీరవాణి తాజాగా ఓ జాతీయ విూడియాతో మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పారు.ఇక మహేశ్‌, రాజమౌళి కలిసి సినిమా చేస్తున్నారనే విషయం తెలిసిన క్షణం నుంచే అభిమానుల్లో అంచనాలు మొదలయ్యాయి..


ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి కథ కావడం, అందులో మహేశ్‌ మునుపెన్నడూ చూడని లుక్‌లో కనిపిస్తారనే టాక్‌ రావడంతో మరింత ఆసక్తి నెలకొంది. ఇప్పటికే మహేష్‌పై ఎనిమిది రకాల లుక్‌ టెస్ట్‌లు జరిగాయి. అందులో ఏదో ఒక లుక్‌ ఫైనల్  చేస్తారని టాక్‌. అలాగే థాయ్‌ల్యాండ్‌లో స్కేటింగ్‌ తదితర శిక్షలు తీసుకొనివచ్చారు మహేష్. కె.ఎల్‌ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇంకా చదవండి: కల్కి పాత్రల చిత్రీకరణపై సర్వత్రా ఆసక్తి!

# SSMB29     # Maheshbabu     # SSRajamouli     # TeluguCinema