
యువతను ఆకట్టుకునే ఎలిమెంట్స్ తో రూపొందిన టీనేజ్ లవ్ స్టోరీ 'మధురం' ఏప్రిల్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్
13 days ago | 5 Views
యంగ్ హీరో ఉదయ్ రాజ్, వైష్ణవి సింగ్ జంటగా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై రాజేష్ చికిలే దర్శకత్వంలో అభిరుచి గల నిర్మాత యం.బంగార్రాజు నిర్మించిన చిత్రం మధురం. ఎ మెమొరబుల్ లవ్ అనేది ట్యాగ్ లైన్. టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం.. ఇప్పటికే షూటింగ్ తో సహా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతోంది. ఏప్రిల్ 18న గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సందర్భంగా హీరో ఉదయ్ రాజ్ మాట్లాడుతూ.. ' శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్స్ అధినేత బంగార్రాజు గారు ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. అలాగే దర్శకుడు రాజేష్ అత్యద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మా కెమెరామెన్ మనోహర్ ఎక్సలెంట్ ఫోటోగ్రఫీ చేశారు. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ వెంకీ వీణ సూపర్బ్ సాంగ్స్ ఇచ్చారు. మధురం ఎ మెమొరబుల్ లవ్.. ఇట్స్ ఎ క్లీన్ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్.. అందరూ ఎంజాయ్ చేసే విధంగా ఈ చిత్రం ఉంటుంది. ఈ సినిమా నాకు టర్నింగ్ పాయింట్ అవుతుంది" అని అన్నారు.
చిత్ర దర్శకుడు రాజేష్ చికిలే మాట్లాడుతూ.. '1990 నేపథ్యంలో జరిగే టీనేజ్ లవ్ స్టోరీ ఇది. అప్పటి స్కూల్ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్ళకు కట్టిన్నట్లు చూపిస్తూ.. ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. సినిమా చూశాక అప్పటి వాళ్ళ స్కూల్ డేస్.. కాలేజ్ డేస్ గుర్తుకు తెచ్చేలా ఈ మూవీ ఉంటుంది. ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని రూపొందించాం. మా నిర్మాత బంగార్రాజు మా వెన్నంటే ఉండి సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేశారు. అలాగే మా డిఓపి మనోహర్ బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చాడు. ఈ సినిమా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది" అని చెప్పారు.
నిర్మాత యం బంగార్రాజు మాట్లాడుతూ.. "రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. పోస్ట్ ప్రొడక్షన్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం. ఏప్రిల్ 18న సినిమా విడుదల చేస్తున్నాం. ఇప్పటికే నితిన్ గారు రిలీజ్ చేసిన టీజర్ కు మంచి స్పందన లభించింది. సినిమా కూడా అందరికీ నచ్చేలా ఉంటుంది" అని అన్నారు.
హీరోయిన్ వైష్ణవి సింగ్ మాట్లాడుతూ.."ఇదొక యూత్ ఫుల్ ఎంటర్టైనర్. ఇందులో నా క్యారెక్టర్ అందరిని అలరిస్తుంది. ఉదయ్ రాజ్ చాలా సపోర్ట్ చేశారు. ఇలాంటి మంచి కాన్సెప్ట్ లో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్" అని చెప్పారు.
నటీనటులు ; ఉదయ్ రాజ్, వైష్ణవీ సింగ్, బస్ స్టాప్ ఫేం కోటేశ్వర రావు, కిట్టయ్య, ఎఫ్ ఎం బాబాయ్, దివ్య శ్రీ, సమ్యు రెడ్డి, జబర్దస్త్ ఐశ్వర్య, ఉష, అప్పు, రామ్ తదితరులు ..
కెమెరామెన్; మనోహర్ కొల్లి,
మ్యూజిక్; వెంకీ వీణ, పాటలు; రాఖీ,
ఎడిటర్; ఎన్టీఆర్,
నిర్మాత; యం. బంగార్రాజు, కథ-మాటలు-స్క్రీన్ ప్లే- దర్శకత్వం; రాజేష్ చికిలే,
పి. ఆర్.ఓ; జి కె మీడియా (కుమార్, గణేష్)
ఇంకా చదవండి: ఉగాది రోజున నందమూరి బాలకృష్ణ ‘ఆదిత్య 369’ రీ-రిలీజ్ ఫంక్షన్!
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# మధురం # ఉదయ్ రాజ్ # వైష్ణవీ సింగ్