నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్, ఏపీ, కర్ణాటకలో ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ ద్వారా ఈ నెల 31న గ్రాండ్ రిలీజ్ కు వస్తున్న ఆనంద్ దేవరకొండ

నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్, ఏపీ, కర్ణాటకలో ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ ద్వారా ఈ నెల 31న గ్రాండ్ రిలీజ్ కు వస్తున్న ఆనంద్ దేవరకొండ "గం..గం..గణేశా"

1 month ago | 28 Views

ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "గం..గం..గణేశా" ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర పంపిణీ సంస్థలను ఖరారు చేశారు. "గం..గం..గణేశా" సినిమాను నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్, ఏపీ, కర్ణాటకలో ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. పలు భారీ, సక్సెస్ ఫుల్ సినిమాలను పంపిణీ చేసిన మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ ద్వారా తమ సినిమా విడుదల కావడం సంతోషంగా ఉందని "గం..గం..గణేశా" టీమ్ చెబుతున్నారు.

"గం..గం..గణేశా" లో ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించగా..ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సెన్సార్ నుంచి క్లీన్ యు సర్టిఫికెట్ పొందిన "గం..గం..గణేశా" సకుటుంబ ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతోంది.

ఇంకా చదవండి: రోహిత్‌ శెట్టి 'సింగం అగెయిన్‌'!

# GamGamGanesha     # UdayShetty     # AnandDeverakonda     # TeluguCinema    

trending

View More