
విడుదలైన నాలుగురోజుల్లోనే 200 కోట్లు వసూలు .. ఎంపరాన్ రికార్డు
6 days ago | 5 Views
ఒకవైపు వివాదాలను ఎదుర్కోంటునే మరోవైపు బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతుంది మలయాళ చిత్రం ఎల్ 2 ఎంపురాన్ . మలయాళీ సూపర్ స్టార్, నటుడు మోహన్లాల్ ప్రధాన పాత్రలో నటించగా.. మలయాళ నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మంజు వారియర్ , టోవినో థామస్ కీలక పాత్రల్లో నటించారు. మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఒకవైపు పాజిటివ్ టాక్తో దూసుకుపోతునే మరోవైపు వివాదాల్లో చిక్కుకుంది.
గుజరాత్ గోద్రా అల్లర్లకు సంబంధించి ఒక వర్గాన్ని అవమానకరంగా చిత్రీకరించే విధంగా ఈ చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయని విమర్శలు వచ్చాయి. దీంతో ఈ వివాదంపై సెన్సార్ బోర్డ్ 17 కట్స్ చెప్పడంతో పాటు మోహన్లాల్ కూడా క్షమాపణలు తెలిపాడు. అయితే ఎన్ని వివాదాలు వచ్చిన కలెక్షన్స్లో మాత్రం తగ్గట్లేదు ఈ చిత్రం. విడుదలైన కేవలం నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లకు పైగా వసుళ్లను రాబట్టింది. దీంతో నాలుగు రోజుల్లోనే రూ.200 కోట్ల రాబట్టిన తొలి మలయాళ చిత్రంగా ఎంపురాన్ రికార్డు నమోదు చేసింది. ఇప్పటివరకు ఈ రికార్డు ‘మంజుమ్మల్ బాయ్స్’ సినిమా పేరిట ఉండగా.. తాజాగా ఈ రికార్డును అధిగమించింది.
ఇంకా చదవండి: శోభితకు బంపరాఫర్.. తమిళ దర్శకుడి సినిమాలో అవకాశం
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!